పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కోసం రంగంలోకి దిగిన మెగా కోడలు ఉపాసన..!

తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2023-08-05 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే ముందుగానే థియేటర్స్ వద్ద అభిమానులు చేసే రచ్చ అంత ఇంత కాదు. అలాంటిది ఆయన పాలిటిక్స్‌లో దిగారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు పాలిటిక్స్ చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ స్థాపించి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా మెగా కోడలు ఉపాసన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం రంగంలోకి దిగారని ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలిసిన అభిమానులు సంబరపడుతున్నారు. మెగా కోడలు ఉపాసన నిర్ణయానికి అందరూ గౌరవిస్తారు. ఉపాసన అందరి గురించి ఆలోచిస్తుంది. తన భర్త రామ్ చరణ్ గురించి కూడా ఎంతో ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ఇప్పుడు రంగంలోకి దిగారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని ప్రచారం చేయాలని అనుకుంటున్నారట. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలని ఉపాసన సూచించిందని తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి అండగా మెగా ఫ్యామిలీ జనసేన పార్టీ కోసం రంగంలో దిగినట్లుగా టాక్ నడుస్తోంది.

Read More:  మీ అభిమానం చూస్తుంటే భయమేస్తోందంటూ.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ నోట్

Tags:    

Similar News