ఈ మూవీ కోసం నేనే పాట రాసి, పాడి, డ్యాన్స్ కూడా కంపోజ్ చేశాను.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

యంగ్ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-08-30 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నవీన్ పొలిశెట్టి నటించిన జాతి రత్నాలు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అలా అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు మత్తు వదలరా సీక్వెన్స్‌‌గా వస్తున్న మత్తు వదలరా 2 అనే సినిమాతో అలరించడానికి మన ముందుకు రాబోతుంది.

ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతుండగా తాజాగా నేడు టీజర్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ టీజర్ చూస్తుంటే పార్ట్ 1 లాగే ఫుల్ సస్పెన్స్ కామెడీ ఎంటర్టైనర్ లాగే ఉండబోతుందని తెలుస్తుంది. అయితే మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నా సొంతంగా ఒక ర్యాప్ సాంగ్ రాసాను, నేనే రాసి నేనే పాడాను కూడా. అలాగే దీనికి డాన్స్ కొరియోగ్రఫీ కూడా నేనే చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News