హీరో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగి ఆ నీళ్ళను నెత్తిన చల్లుకోవాలి.. జనసేన నేత సంచలన కామెంట్స్

గత కొంత కాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-29 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా హీరో అల్లు అర్జున్‌పై జనసేన పార్టీ నాయకుల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై హాట్ కామెంట్స్ చేయగా.. ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చలమలశెట్టి మాట్లాడుతూ.. మేమంతా చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తుంటే.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ హీనంగా ప్రవర్తిస్తున్నారని చలమలశెట్టి రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గన్నవరం నియోజకవర్గంలో పుష్ప 2 సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ కామెడీ యాక్టర్‌లా కనబడుతున్నారని, హీరోలా కనబడడం లేదన్నారు. హీరో అంటే రాంచరణ్ అని, అతడిని చూసి నేర్చుకోవాలని సూచించారు. పిల్లికి బిచ్చం పెట్టని అల్లు అరవింద్ ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా అంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 6వ తేదీన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగి ఆ నీళ్ళను పబ్లిగ్గా మీడియా ముందు నెత్తిన చల్లుకుంటేనే అల్లు అర్జున్‌ మాట్లాడిన మాటలకు ప్రక్షాళన జరుగుతుందన్నారు. అప్పుడే తమ నియోజకవర్గంలో పుష్ఫ 2 సినిమాను అనుమతిస్తామని చలమలశెట్టి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట దుమ్ము దుమారం రేపుతున్నాయి.

(video link credits to Aadhan Telugu X account)


Similar News