Sukesh Chandrashekhar : కరణ్ జోహర్‌కు సుకేశ్ ఆఫర్.. జాక్వెలిన్‌ పేరును ప్రస్తావిస్తూ లెటర్

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని తిహార్ జైలులోనే ఉన్నప్పటికీ.. ఏదో ఒక అంశంతో వార్తల్లోకి రావడం మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు అలవాటైపోయింది.

Update: 2024-10-21 14:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని తిహార్ జైలులోనే ఉన్నప్పటికీ.. ఏదో ఒక అంశంతో వార్తల్లోకి రావడం మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు అలవాటైపోయింది. తాజాగా అతడు సినీ నిర్మాత కరణ్ జోహర్‌కు భారీ పెట్టుబడి ఆఫర్ ఇచ్చారు. కరణ్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌‌లో 50 నుంచి 70 శాతం వాటాను కొనేందుకు రెడీ అని సుకేశ్ ప్రకటించాడు. ఈమేరకు తన లీగల్ అడ్వైజర్ ద్వారా ధర్మ ప్రొడక్షన్స్‌‌‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పంపాడు. తాను చేసిన ఆఫర్‌కు బేషరతుగా కరణ్ ఓకే చెబితే.. 48 గంటల్లోగా ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేస్తానని సుకేశ్ తెలిపాడు. తనకు చెందిన ఎల్‌ఎస్ హోల్డింగ్స్ ద్వారా ధర్మ ప్రొడక్షన్స్‌‌లో పెట్టుబడులు పెడతానన్నాడు.

‘‘సినిమాలంటే నాకు చాలా ఆసక్తి. అందుకే ఈ ఆఫర్ ఇస్తున్నా. ఆసియాలోనే అతిపెద్ద జైలు నుంచి బిగ్ బిజినెస్ డీల్ రావడం అసాధారణ విషయమే. అసాధారణ పరిస్థితులు, ప్రదేశాలు, వ్యక్తులే అద్భుతాలను చేయగలుగుతారు కరణ్’’ అని సుకేశ్ పేర్కొన్నాడు. ‘‘కరణ్ జోహర్ చాలా మంచి వ్యక్తి. నేను, నా కుటుంబం, నా లవర్ జాక్వెలిన్ ధర్మ ప్రొడక్షన్స్‌కు వీరాభిమానులం. వాళ్లందరి కోసం ఆ కంపెనీలో వాటా కొనే అవకాశం లభిస్తే సంతోషిస్తా’’ అని సుకేశ్ చంద్రశేఖర్‌ చెప్పుకొచ్చాడు. ఈమేరకు వివరాలతో సుకేశ్ రాసిన లేఖను అతడి పీఆర్ టీమ్ మీడియాకు విడుదల చేసింది. 


Similar News