స్టాక్ మార్కెట్ల భారీ పతనం.. నిమిషాల వ్యవధిలోనే ₹7 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు
బుధవారం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో నిమిషాల వ్యవధిలో రూ. 7 లక్షలకోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయినట్లు తెలుస్తుంది.
దిశ, వెబ్డెస్క్: బుధవారం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో నిమిషాల వ్యవధిలో రూ. 7 లక్షలకోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల అమ్మకాల మధ్య సెన్సెక్స్ ఈ రోజు 1,000 పాయింట్లు దిగజారగా, నిఫ్టీ 259 పాయింట్లు పడిపోయి 24,173 వద్దకు పడిపోయింది. సెన్సెక్స్లో M&M, HCL టెక్, టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి స్టాక్లు నష్టాలను చవిచూడగా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడింది. స్టాక్ మార్కెట్లో తీవ్ర తగ్గుదల కారణంగా, మునుపటి సెషన్లో నమోదైన ₹451.27 లక్షల కోట్ల విలువతో పోలిస్తే పెట్టుబడిదారులు ₹7.38 లక్షల కోట్లను కోల్పోయి ₹443.89 లక్షల కోట్లకు చేరుకుంది.
బిఎస్ఇలో ఈరోజు 208 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిని తాకగా, బిఎస్ఇలో కేవలం 21 షేర్లు 52 వారాల గరిష్టానికి తాకాయి. 3,802 స్టాక్లలో 759 మాత్రమే గ్రీన్ మార్క్లో ట్రేడవుతుండగా, దాదాపు 2,905 స్టాక్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈరోజు బిఎస్ఇలో మొత్తం 19 రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బిఎస్ఇ ఆటో, మెటల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కూడా నష్టపోయాయి. దీంతో బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 678 పాయింట్లు క్షీణించి 46,861 వద్దకు, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇండెక్స్ 909 పాయింట్లు జారి 53,245 స్థాయికి పడిపోయాయి.