మరో సంచలనానికి తెరలేపిన జియో.. అతి తక్కువ ధరకే 4G ల్యాప్‌టాప్

రిలయన్స్ జియో యాజమాన్యం మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. జియో 4G ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నది. అది కూడా అతి తక్కువ ధరతో ఈ అక్టోబర్‌

Update: 2022-10-04 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియో యాజమాన్యం మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. జియో 4G ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నది. అది కూడా అతి తక్కువ ధరతో ఈ అక్టోబర్‌లోనే మార్కెట్లోకి తీసుకురానుంది. కేవలం రూ.15 వేలకే దానికి విక్రయించనుంది. ఇప్పటికే క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. జియో బుక్ కోసం ఈ డీల్ కుదిరింది. క్వాల్‌కామ్ సంస్థ కంప్యూటింగ్ చిప్ అందించనుండగా ఏఆర్ఎం లిమిటెడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకోనుంది. విండోస్ ఓఎస్ యాప్స్ సపోర్ట్ చేసేలా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పటికే 42 కోట్లమంది యూజర్లతో రిలయన్స్ జియో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. త్వరలో లాంచ్ చేయనున్న జియో ల్యాప్‌టాప్‌ను ముందుగా ప్రభుత్వ స్కూల్స్, కళాశాలలకు అందించనుందని సమాచారం. అయితే జియో నుంచి మాత్రం ల్యాప్‌టాప్‌ల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. జియో బుక్ అనేది దేశీయంగా తయారు కానుంది.

Tags:    

Similar News