Freedom Sale: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్ ధర రూ.1,947

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.

Update: 2024-08-01 10:11 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. "ఫ్రీడమ్ సేల్" క్రింద రూ.1947 లకే విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఆగస్టు 5 వరకు బుకింగ్‌ల కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న వారు దేశీయ, అంతర్జాతీయ రూట్లలో సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఢిల్లీ-జైపూర్, బెంగళూరు-గోవా, ఢిల్లీ-గ్వాలియర్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు దేశీయంగా 32 రూట్లు, అంతర్జాతీయంగా 15 రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది.

విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, SMEలు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సభ్యులు (వారిపై ఆధారపడిన వారు) ప్రత్యేక తగ్గింపు ధరలను పొందవచ్చు. airindiaexpress.com ద్వారా బుకింగ్ చేసే వారు ప్రత్యేకంగా జీరో-చెక్-ఇన్ బ్యాగేజీ ఎక్స్‌ప్రెస్ లైట్ చార్జీలకు కూడా యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ చార్జీలలో ఎటువంటి ఫీజు లేకుండా అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం. చెక్-ఇన్ బ్యాగేజీకి దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ. 1,000 తగ్గింపు, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.1,300 తగ్గింపు కూడా ఉంది. ఇంకా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లాయల్టీ మెంబర్స్‌కు ప్రత్యేకమైన తగ్గింపులు ఉన్నాయి.

Tags:    

Similar News