ఆ ప్రాంతంలో బెగ్గర్ వ్యవస్థను రూపుమాపుతాం: తలసాని

దిశ, కంటోన్మెంట్: వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు త్వరలోనే కొత్త అందాలను సంతరించుకోనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు రూ. 30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పుట్ పాత్ లు, బస్ షెల్టర్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను మంత్రి ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిత్యం లక్షలాది మంది […]

Update: 2020-06-18 03:00 GMT

దిశ, కంటోన్మెంట్: వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు త్వరలోనే కొత్త అందాలను సంతరించుకోనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు రూ. 30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పుట్ పాత్ లు, బస్ షెల్టర్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను మంత్రి ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిత్యం లక్షలాది మంది ఇక్కడి నుండి రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకొని.. వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ సంకల్పంతో ఉన్నారని ఆయన వివరించారు. ఇక్కడ థీం పార్క్ లను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్.. అధికారులను ఆదేశించినట్లు తలసాని పేర్కొన్నారు. ఒక సంవత్సరంలోగా జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్, వాటర్ వర్క్స్, ఇతర శాఖల సమన్వయంతో ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణం, పుట్ పాత్ లు, టాయిలెట్స్, రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాంతంలో బెగ్గర్ వ్యవస్థను కూడా రూపుమాపుతామని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్.. అందరికీ ఉపాధి కల్పిస్తున్నారని, అందరూ ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కేటీఆర్ మంత్రి అయినంక హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. దేశం మొత్తం కరోనా నియంత్రణ చర్యలలో ఉంటే జీహెచ్ ఎంసీ మాత్రం ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటూనే, మరో వైపు అభివృద్ధి పనులపై దృష్టి సారించిందని చెప్పారు. లాక్ డౌన్ సమయంలోనే నగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు తదితర అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. లాక్ డౌన్ తర్వాత ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు వీటిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News