బీసీలను అణగదొక్కారు !

దిశ, తెలంగాణ బ్యూరో: లోపభూయిష్ట రిజర్వేషన్లతో బీసీలను అణగదొక్కారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ గోపాల్‌రెడ్డితో హైకోర్టులో కేసు వేయించి రిజర్వేషన్లు కుదించేలా చేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే కుట్ర చేస్తున్నారని, తెలంగాణలో సామాజిక న్యాయం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్, ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశామని పేర్కొన్నారు. తెలంగాణలో పంచాయతీ రాజ్‌ చట్టంలో 34శాతం రిజర్వేషన్లు ప్రకటించారు కానీ ఎన్నికల్లో రిజర్వేషన్లు చేసేందుకు అడ్డుపడ్డారని ఆరోపించారు.

Update: 2020-10-12 08:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోపభూయిష్ట రిజర్వేషన్లతో బీసీలను అణగదొక్కారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ గోపాల్‌రెడ్డితో హైకోర్టులో కేసు వేయించి రిజర్వేషన్లు కుదించేలా చేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే కుట్ర చేస్తున్నారని, తెలంగాణలో సామాజిక న్యాయం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్, ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశామని పేర్కొన్నారు. తెలంగాణలో పంచాయతీ రాజ్‌ చట్టంలో 34శాతం రిజర్వేషన్లు ప్రకటించారు కానీ ఎన్నికల్లో రిజర్వేషన్లు చేసేందుకు అడ్డుపడ్డారని ఆరోపించారు.

Tags:    

Similar News