ముందుగానే ఆ టీ20 చాంపియన్‌షిప్

దిశ, స్పోర్ట్స్: కోవిడ్-19 కారణంగా దేశవాళీ క్రికెట్ సీజన్ ఈ సారి పూర్తిగా రద్దయ్యింది. అయితే వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ కంటే ముందే ముస్తాక్ అలీ టీ20 చాంపియన్‌షిప్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఐపీఎల్ 14వ సీజన్ కోసం జరిగే వేలానికి ముందు ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నిర్వహించడం వల్ల మరింత మంది ఆటగాళ్లను వేలానికి పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నది. అంతే కాకుండా ఆ టోర్నీలో రాణించే ఆటగాళ్ల కోసం పోటీ పెరిగే […]

Update: 2020-11-15 12:02 GMT

దిశ, స్పోర్ట్స్: కోవిడ్-19 కారణంగా దేశవాళీ క్రికెట్ సీజన్ ఈ సారి పూర్తిగా రద్దయ్యింది. అయితే వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ కంటే ముందే ముస్తాక్ అలీ టీ20 చాంపియన్‌షిప్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఐపీఎల్ 14వ సీజన్ కోసం జరిగే వేలానికి ముందు ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నిర్వహించడం వల్ల మరింత మంది ఆటగాళ్లను వేలానికి పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నది. అంతే కాకుండా ఆ టోర్నీలో రాణించే ఆటగాళ్ల కోసం పోటీ పెరిగే అవకాశం ఉంటుందని కూడా బీసీసీఐ చెబుతున్నది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాల అసోసియేషన్లకు బీసీసీఐ మౌఖికంగా సమాచారం అందించిందని.. ఆటగాళ్ల బస, ఇతర వసతుల కోసం ఏర్పాట్లు చేయాలని కోరినట్లు తెలుస్తున్నది. ఏ రాష్ట్ర అసోసియేషన్ పరిధిలో మూడు స్టేడియంలు ఉన్నాయో.. వాళ్లకే ఈ టోర్నీలో ఎక్కవ మ్యాచ్‌లు కేటాయించే అవకాశం ఉన్నది.

Tags:    

Similar News