AP News:వైయస్ షర్మిల కడప పర్యటన షెడ్యూల్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కడప జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2024-08-29 14:23 GMT

దిశ,కడప:ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌కి చేరుకుంటారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద ఉదయం 8 గంటలకు నివాళులు అర్పిస్తారు. అనంతరం జిల్లా నేతలను, పార్టీ కార్యకర్తలను కలుస్తారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. సెప్టెంబర్ 3న కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సెప్టెంబర్ 4న కడప నుంచి విజయవాడ చేరుకుంటారు.


Similar News