పక్కా ఆధారాలతో వైసీపీ సంచలన ట్వీట్

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ(YCP) సంచలన ఆరోపణలు చేసింది. చెప్పిన మాట ప్రకారం సరిగ్గా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ట్వీట్ పెట్టింది.

Update: 2024-10-24 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ(YCP) సంచలన ఆరోపణలు చేసింది. చెప్పిన మాట ప్రకారం సరిగ్గా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ట్వీట్ పెట్టింది. ‘మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్న వారికి టీటీడీ చైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ అడ్డంగా దొరికిన న్యూస్ ఛానల్ అధినేత, సాక్ష్యాలిదిగో’ అంటూ కొన్ని పత్రాలను జతచేసి ట్వీట్ పెట్టింది. ఇదిలా ఉండగా.. బుధవారం ‘ట్రూత్‌ బాంబ్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు డ్రాప్ అవుతోంది. స్టే ట్యూన్’ అంటూ వైసీపీ ట్వీట్ పెట్టిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ‘ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్’ అనే పోస్టర్‌ను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తాజాగా ఇవాళ క్లారిటీ ఇస్తూ వైసీపీ సంచలన పోస్టు పెట్టింది.


Tags:    

Similar News