వైసీపీ ఫెనల్ లిస్ట్ ముహూర్తం ఫిక్స్.. మేనిఫెస్టో కూడా అక్కడే అనౌన్స్ చేసే చాన్స్!

ఈ నెల 16న వైసీపీ తుది జాబితాను ఇడుపాయలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

Update: 2024-03-13 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 16న వైసీపీ తుది జాబితాను ఇడుపాయలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు. అదే రోజు మేనిఫెస్టోను విడుదల చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక, సీఎం జగన్ రూట్ మ్యాప్‌ను వైసీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. 2019లో కూడా ఇడుపుల పాయలో లిస్ట్‌ను జగన్ విడుదల చేశారు. ఇప్పటికే అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారు కాగా.. ఒకటి రెండు మార్పులతో ఫైనల్ లిస్టు ఉండనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సాఆర్ ఘాట్ వద్ద అధికారికంగా తుది జాబితాను వైఎస్ జగన్ ప్రకటించనున్నారు.

Read More..

అసలు పోలికే లేదు..వాళ్ళు అన్నదమ్ములేందిరా బై.. పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News