పోలవరంకు కొత్త సీఈఓ రాక

పోలవరం ప్రాజెక్టు సీఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అతుల్ జైన్ నేడు ప్రాజెక్టును సందర్శించనున్నారు. రేపు జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ప్రాజెక్టు నిర్మాణ సమస్యలపై చర్చించనున్నారు.

Update: 2024-10-03 02:21 GMT

దిశ, పోలవరం: పోలవరం ప్రాజెక్టు నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అతుల్ జైన్ గురువారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నూతనంగా భాద్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సందర్శించనున్నారు. నూతనంగా నిర్మించనున్న డయాఫ్రంవాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం, ఇతర ప్రాంతాలను పరిశీలించి అనంతరం రాజమహేంద్రవరంలో బస చేస్తారు. రేపు పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జలవనరులశాఖ అధికారులు, వ్యాప్కోస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 5వ తేదీన తిరిగి ఢిల్లీ వెళతారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.


Similar News