పల్లెపండుగలో మంత్రులు.. టీడీపీలో భారీగా చేరికలు

ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తమ తమ జిల్లాల్లో పర్యటించారు. మంత్రి కొండపల్లి సమక్షంలో 120 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

Update: 2024-10-20 10:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పల్లెపండుగ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా బూరుగుపల్లిలో నిర్వహించిన పల్లెపండుగ వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రూ.35 లక్షలతో బూరుగుపల్లి, దొడ్డిపట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కూటమి పాలనలో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమానంగా నిర్వహిస్తోందన్నారు.

విజయనగరంలో మంత్రి కొండపల్లి..

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామంలో పర్యటించారు. వైసీపీని వీడిన 120 కుటుంబాలు ఆయన సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు సాగుతుందన్నారు.


Similar News