AP News:ఆ ఆలయంలో ఆధార్ కార్డు ఉంటేనే దర్శనం.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే

శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెళ్లే స్థానికులు తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-10-17 15:05 GMT

దిశ,శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెళ్లే స్థానికులు తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన పట్టణంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడుతూ స్థానికుల దర్శనం విషయమై ఈవో తో చర్చించామని ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళిన వారిని మాత్రమే అనుమతించాలని సూచించినట్లు తెలిపారు. దీనిపై ఎటువంటి వివాదాలు అవసరం లేదని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.

గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీళ్లు చేరుతున్నాయని, కొన్ని చెరువులకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించామని, నష్టాలు భారీ సంఖ్యలో లేవని తెలిపారు. పట్టణంలోని మురుగు నీటి కాలువలలో ముందుగానే పూడిక తీయడం వల్ల రోడ్లపై నీరు నిలవకుండా సాఫీగా వెళ్ళాయని తెలిపారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనిపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.


Similar News