Pawan Kalyan: పవన్ కల్యాణ్ పాటిస్తున్న సనాతన ధర్మంపై స్టార్ సింగర్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

తిరుమల తిరుపతి లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-26 08:57 GMT

దిశ, సినిమా: తిరుమల తిరుపతి లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై, సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టి తాను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని బలంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా, స్టార్ సింగర్ ఎస్పీ శైలజ, పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. జరుగుతున్న వివాదంలో పవన్ చేస్తుంది తప్పా, రైటా అని అడగ్గా.. ‘‘ఎవరి ధర్మం వారికి ముఖ్యం. ఆయన ఇది నా ధర్మం అనుకొని చేస్తున్నారు కాబట్టి మధ్యలో వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు.

ఆయన ఇలా చేస్తేనే నా స్వామికి ప్రక్షాళన జరుగుతుందని అనుకుంటున్నారు కాబట్టే చేస్తున్నారు. ఆయన నమ్ముతుంది చేయడంలో తప్పేముంది. చేతనైతే సహాయం చేయండి లేకపోతే దూరం నుంచి చూడండి. ఇందులో వివాదాలు లేవు. అన్నీ దేవుడు చూసుకుంటారు. మనం ఎవ్వరం పవన్‌కు సపోర్ట్ చేయనక్కర్లేదు. ఆయనలో ఉండే శక్తి, భగవంతుడి మీద ఉండే భక్తి నడిపిస్తుంది. కాబట్టి మనం వెనకాల ఉండి మాట్లాడటం అవసరం లేదు. మంచి పని చేస్తున్నప్పుడు ప్రేక్షకులుగా ఉండి చూడాలి కానీ తప్పు ఎత్తి చూపించి మాట్లాడకూడదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ శైలజకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


👉 Click Here For Tweet


Similar News