జవాన్కు ఘనంగా అంత్యక్రియలు

మండ్ల ప్రసాద్ అనే జవాన్ కు నెల్లూరులో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Update: 2023-04-11 15:24 GMT

దిశ, నెల్లూరు: జమ్ము, కాశ్మీర్‌ లడఖ్‌ ప్రాంతంలో ప్రసాద్ అనే జవాన్ విధులు నిర్వహిస్తూ జారిపడ్డాడు. చికిత్స పొందుతూ ఆయన ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. సీతారామపురానికి చెందిన మండ్ల ప్రసాద్‌ (41) 21 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. విది నిర్వహణలో మంచుకొండల్లో శుక్రవారం జారిపడి తీవ్ర గాయాలుకాగా తోటి జవాన్లు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. సీతారామపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గత ఆరేళ్ల క్రితం తమ్ముడు మండ్ల రమేష్‌ జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ గన్‌ మిస్‌ ఫైర్‌ అయి మృతిచెందాడు. అన్నదమ్ములిద్దరూ విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు, జవాన్ మృతిపై పలువురు రాజకీయ నాయకులు కుటుంబసభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News