ఆంధ్రప్రదేశ్‌కు ప్రభాస్ ‘కల్కి’ నిర్మాత భారీ విరాళం

వర్షం, వరదలు ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.‌

Update: 2024-09-02 16:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: వర్షం, వరదలు ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.‌ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేగాకుండా.. వర్షాలు, వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి నుంచి స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. విపత్తు సమయంలో ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ గొప్ప మనసు చాటుకున్నారు. వరదల వేళ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో అందించారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా తెలియజేశారు.



Similar News