ఏపీ ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు నాయుడు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీ పెరంబదూర్లోని శ్రీ రామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Update: 2023-12-13 05:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీ పెరంబదూర్లోని శ్రీ రామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు మరిచిపోలేను అన్నారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు , తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తాను అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని...5ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చంద్రబాబు వెల్లడించారు. అందరి సహకారంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెన్నై విమానాశ్రయం వద్ద స్థానిక ప్రజలు, అభిమానులు చంద్రబాబు నాయుడుకి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

Tags:    

Similar News