అవును టీడీపీలో చేరుతున్నా.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోపిదేవి

టీడీపీలో చేరుతున్నట్లు మోపిదేవి ఫుల్ క్లారిటీ ఇచ్చారు..

Update: 2024-08-29 10:54 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ టీడీపీలో చేరబోతున్నారన్న సస్పెన్స్‌కు తెరపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరిగినట్లుగానే  మోపిదేవి వెంకట రమణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాను ఏ పార్టీ చేరబోతున్నారనేదానిపైనా క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరుబోతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తనకు రాష్ట్ర రాజకీయాలంటే మక్కువని చెప్పారు. రేపల్లె టికెట్ తనకు కాకుండా ఇంకొకరికి ఇచ్చి ఉంటే ఫలితం దక్కేదన్నారు. టికెట్ విషయంలో జగన్‌కు చాలా చెప్పానని, కానీ వినిపించుకోలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరుబోతున్నది వాస్తవమేనని మోపిదేవి వెంకట రమణ వెల్లడించారు. త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నట్లు ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 

Tags:    

Similar News