తొలి జాబితాలో గంజి చిరంజీవి, 9వ లిస్టులో మురుగుడు లావణ్య

మంగళగిరి అభ్యర్థిని వైసీపీ అధిష్టానం మరోసారి మార్పు చేసింది...

Update: 2024-03-01 16:24 GMT

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి అభ్యర్థిని వైసీపీ అధిష్టానం మరోసారి మార్పు చేసింది. తొలి జాబితాలో గంజి చిరంజీవి ప్రకటించింది. అయితే 9వ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మంగళగిరి ఇంచార్జిగా మురుగుడు లావణ్యను ప్రకటించారు. ఇప్పటి వరకు అధిష్టానం 9 జాబితాలు విడుదల చేసింది. మొత్తం 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 18 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటన చేశారు. ఇప్పటివరకూ 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం మొండి చెయ్యి చూపింది.


కాగా మురుగుడు లావణ్య మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాదు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కొడలు. మంగళగిరిలో పలు సర్వేలు చేసిన అధిష్టానం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. చివరకు మురుగుడు లావణ్యకు మంగళగిరి టికెట్ ఖరారు చేశారు.

నారా లోకేశ్‌పై మరోసారి అభ్యర్ధిని మార్చిన వైసీపీ


Similar News