CM Chandrababu:రేపు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Update: 2024-08-30 09:52 GMT

దిశ ప్రతినిధి,కర్నూలు:సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు జిల్లాలోని పత్తికొండ మండలం, పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్ ఐపీఎస్ శుక్రవారం ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు బందోబస్తు, తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు.

ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయాలని తెలిపారు. విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎయిర్ పోర్టు, ఇంటెలిజెన్స్ అధికారులు, డీఎస్పీలు జె. బాబు ప్రసాద్, కృష్ణమోహన్, శ్రీనివాస రావు, సీఐలు ప్రసాద్, చంద్రబాబు నాయుడు, ఎస్సైలు మల్లికార్జున, సునీల్ పాల్గొన్నారు.


Similar News