Breaking: సీఎం జగన్‌పై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

Update: 2023-04-07 17:06 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల్లో అసంతృప్తి వాస్తవమేనని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలను ఎలా డీల్ చేయాలో సీఎం జగన్‌కు తెలియడంలేదని తెలిపారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రెండోసారి అధికారంలోకి వస్తేనే పూర్తి అనుభవం వస్తుందమోనన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో జగన్‌కు ఇంకా అనుభవం రాలేదని చెప్పారు. మరో ఐదేళ్లు జగన్‌కు అనుభవం వస్తుందని సాయి ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. 

Tags:    

Similar News