Bolero Overturned: ముగ్గురు దుర్మరణం, మరో ఐదుగురికి గాయాలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ...

Update: 2024-09-08 16:51 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన అలూరు మండలం హులేబీడు సమీపంలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు ఆదోనికి చెందిన గౌస్, షమీరా, సస్రీన్‌లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. రోడ్డుపై భారీగా అయిన ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. టైర్ పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News