జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-10-13 12:29 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(NTR District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై కారు(Car)ను టిప్పర్ లారీ(Tipper Lorry) ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడ(Vijayawada) నుంచి హైదరాబాద్(Hyderabad) వైపు వెళ్తుండగా కారును రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై(National Highway) కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్(Traffic jam) అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News