కడియం నర్సరీ ప్రాంతానికి "చిరుత".. భయాందోళనలో స్థానికులు

రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా జాడ లేకపోవడం తెలిసింది.

Update: 2024-09-25 04:11 GMT

దిశ ప్రతినిధి,కోనసీమ: రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా జాడ లేకపోవడం తెలిసింది. అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అడవి శాఖ అధికారులు ధ్రువీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలి ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం- వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు. అడవి శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడల ఉన్నట్లు గుర్తించారు.

అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అందరూ భయపడి రైతులు ఎవరు నర్సరీలో ఉండటం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎవరూ బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని, దగ్గరగా ఉండే వారు మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు.


Similar News