సైకో జగన్ ఇచ్చేది పౌష్టికాహారమా? విషాహారమా?: లోకేశ్

అంగన్వాడీ కేంద్రంలో గర్భిణిలకు ఇచ్చే పౌష్టికాహారంలో పాము కలేబరం ప్రత్యక్షమవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.

Update: 2023-10-12 11:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అంగన్వాడీ కేంద్రంలో గర్భిణిలకు ఇచ్చే పౌష్టికాహారంలో పాము కలేబరం ప్రత్యక్షమవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. పాము కలేబరంపై ట్విట్టర్ వేదికగా లోకేశ్ స్పందించారు.‘సైకో జగన్ ఇచ్చేది పౌష్టికాహారమా? విషాహారమా?’ అని నిలదీశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం జంబువారిపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు ఇచ్చే పౌష్టికాహారంలో చచ్చిన పాము బయటపడింది. పిచ్చి జ‌గ‌న్ పాల‌న‌ని గాలికొదిలేసి త‌న రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం ప్ర‌భుత్వాన్ని, వ్య‌వ‌స్థ‌ల్ని వాడుకుంటూ ప్ర‌శ్నించే ప్రతిపక్ష నేతలని జైలులో పెట్టించి వికృతానందం పొందుతున్నాడు. గ‌ర్భిణుల‌కు విషాహారం పంపిణీ చేయిస్తున్న‌ సైకో జ‌గ‌న్ నిన్ను నమ్మం అంటున్నారు జ‌నం’అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News