తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ నెలకొంటుంది.

Update: 2024-09-27 04:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ నెలకొంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) భక్తుల రద్దీ నెలకొంది.

తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు(Devotees) వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. ఇదిలా ఉంటే నిన్న(గురువారం) శ్రీవారిని 61,328 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 22,033 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Income) రూ.3.84కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.


Similar News