ఆత్మహత్య చేసుకునే స్థితికి నన్ను తీసుకొచ్చింది ఆయనే.. కానీ..! ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-16 09:49 GMT

దిశ వెబ్ డెస్క్: వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణం వీడిందని.. అందుకే చంద్రబాబు ఇంటికి వెళ్లారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తమని ఊచ కొత్త కోశారని మండిపడ్డారు. జైల్లో 14 రోజులపాటు  ఒకే బట్టతో స్నానం లేకుండా తమని మగ్గేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలానే తనని, తన కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రోస్తాహిచారు అని.. తాను ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ భగవంతుడు తనకి కలలో కనిపించి చంద్రబాబు పతనం చూద్దువుగాని బిడ్డా.. వాడి పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలా అని చెప్పారని పేర్కొన్నారు. అలా ఆ పరమాత్ముడు తనని ఆత్మహత్య చేసుకోకుండా ఆపారని తెలిపారు.

ఇక ఆ క్షణం నుండి తాను ఏ పండగలు చేసుకోలేదని.. తనని అవమానించిన వాళ్ళు పతనం కావాలని.. వాళ్ళు భూస్థాపితం కావాలని ఆ దేవుడిని రోజు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ భగవంతుడు కరుణించాడని హర్షం వ్యక్తం చేశారు. దీనితో తాను వెంటనే తిరుమల వెళ్లి ఆ వేంకటేశ్వరునికి, అలానే తన ఊరిలోని అమ్మవారికి, పరమేశ్వరుడిని దర్శించుకుని అయ్యా విముక్తి అయ్యింది అని దండం పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఇక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడాల్సిన అవసరం లేదని.. 30 సంవత్సరాలు సీఎంగా జగన్మోహన్ రెడ్డినే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టిస్తారని అన్నారు.

Tags:    

Similar News