YS Jagan:ఒలింపిక్ క్రీడాకారుడు స్వప్నిల్‌కు మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్‌ మరో పతకం సొంతం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో స్వప్నిల్ కాంస్య పతకం సాధించారు.

Update: 2024-08-01 11:58 GMT

దిశ,వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్‌ మరో పతకం సొంతం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో స్వప్నిల్ కాంస్య పతకం సాధించారు. దీంతో ఈ విశ్వ క్రీడాల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఈ నేపథ్యంలో కాంస్య పతకం సాధించిన భారత షూటర్ స్వప్నిల్‌ను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అభినందించారు. ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించిన స్వప్నిల్‌లకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ 3 పొజిషన్స్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా స్వప్నిల్ నిలిచారు. భారత జాతిని గర్వంతో నింపారని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News