Former CM Jagan: మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

జగన్‌ (Former CM Jagan)పై ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ (Minister Narayana) వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని మాజీ సీఎం ఇటీవలే ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు.

Update: 2024-10-22 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగన్‌ (Former CM Jagan)పై ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ (Minister Narayana) వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని మాజీ సీఎం ఇటీవలే ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా తనపై మంత్రి నారాయణ (Minister Narayana) దాఖలు చేసిన ప్రైవేటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

చట్ట ప్రకారంగా.. ప్రైవేటు కేసు చెల్లదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మాజీ సీఎం జగన్ (Former CM Jagan) దాఖలు చేసిన ఆ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి నారాయణ (Minister Narayanana) దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News