ఏలేరుకు వరద ఉధృతి.. ఆ ప్రాంత ప్రజలకు అధికారులు కీలక సూచన
కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో పెద్దాపురం డివిజన్లోని పలు గ్రామాల ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిశ,పెద్దాపురం: కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో పెద్దాపురం డివిజన్లోని పలు గ్రామాల ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏలేరు వరదతో వేలాది ఎకరాల పంట పొలాలు, వందలాది గ్రామాలు నీట మునిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం సంభవించడంతో ఏలేరు ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగింది. శనివారం ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 5,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని, ఏలేరు వరద ప్రవాహిక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.