హైడ్రా తరహా ట్రీట్‌మెంట్.. వణికిపోయిన ద్వారంపూడి అనుచరులు

కాకినాడ టౌన్‌లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు..

Update: 2024-09-24 02:26 GMT

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకినాడ టౌన్‌లో అక్రమ కట్టడాలు వెలిశాయి. వాటిపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో సోమవారం రంగంలోకి దిగారు. ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సంతచెరువు సెంటర్‌లో అక్రమంగా నిర్మించిన షాపుల సముదాయాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిర్మాణాలకు అనుమతులు లేవని, అందుకే కూల్చివేస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారు.


Similar News