అల్లూరి జిల్లాలో దారుణం.. సకాలంలో వైద్యం అందక విద్యార్థి మృతి

అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది...

Update: 2024-09-16 04:35 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లా (Alluri Sitarama Raju District)లో దారుణం జరిగింది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన టెన్త్ విద్యార్థికి సకాలంలో వైద్యం అందక మృతి చెందారు. జీకే వీధి మండలం దోనుగుమ్మల(Donugummala)లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థి కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. అయితే గ్రామంలోనే ప్రాథమిక చికిత్స పొందారు. ఒక్కసారిగా విద్యార్థి పరిస్థితి విషమించింది. దీంతో స్థానిక పట్టణంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు యత్నించారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి త్వరగా రావాలని చెప్పారు. అయితే దోనుగుమ్మలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో అంబులెన్స్ వెళ్లలేకపోయింది. దీంతో డోలీలో విద్యార్థిని కొంతదూరం తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే విద్యార్థి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.


Similar News