ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి భారీ ఊరట... రెండు పిటిషన్లు డిస్మిస్

ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది...

Update: 2024-08-21 10:36 GMT

దిశ, డైనమిక్​ బ్యూరో: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్​ చేసింది. రాజకీయ కక్ష్య సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషన్ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. చంద్రబాబు తరఫున సీనియర్​ లాయర్​ సిద్ధార్ధ లూద్రా వాదనలు వినిపించారు.

Tags:    

Similar News