Twitter War:‘జగన్ పై దాడికి కూటమి కుట్ర’.. వైసీపీ సంచలన ట్వీట్

తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం కల్తీ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

Update: 2024-09-27 07:19 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం కల్తీ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ట్విట్టర్ వార్(Twitter War) జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) తిరుమల పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం జగన్ ఈ రోజు (శుక్రవారం) తిరుమల(Tirumala) చేరుకోనున్నారు. తిరుమల పర్యటన సందర్భంగా ఆటంకాలు సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్ పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని వైసీపీ ట్విట్టర్ వేదికగా ఆరోపిస్తోంది. ‘‘బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు సమాచారం. జగన్ వాహనశ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోంది. జగన్ తిరుమల పర్యటనతో లడ్డూ ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు’’ అని వైసీపీ ట్వీట్ చేసింది.


Similar News