సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డు తయారీ చేసి.. అపవిత్రం చేయడం తో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-09-28 10:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డు తయారీ చేసి.. అపవిత్రం చేయడం తో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం కావాలనే తమను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని వైఎస్ జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవిత్ర తిరుమల తిరుపతిలో ప్రసాదాలు కల్తీ చేశారంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రసాదం కల్తీ జరిగిందని అంటున్న చంద్రబాబు.. ఎలా కల్తీ జరిగిందో తెలియదంటున్నారన్నారు. అలాగే తమను తిరుమలకు రావొద్దని నోటీసులు ఇచ్చారని.. మళ్లీ వాళ్లే ఎవరు వెళ్లొద్దన్నారని ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


Similar News