ఎమ్మెల్యేకు రిలీఫ్.. మూడు ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక హామీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డికి సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు..

Update: 2024-08-27 15:58 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డికి సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. కేంద్రబడ్జెట్‌లో మంజూరైన టైక్స్ టైల్ పార్క్, పశువుల లైవ్ స్టాక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం, ఎమ్మిగనూరు మీదుగా కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతామన్నారు. ఆయా శాఖ మంత్రులకు లేఖ రాస్తానని తెలిపారు. ఎమ్మిగనూరులో 3 జలవనరుల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని ఎమ్మెల్యేకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డి కలిశారు. నియోజకవర్గం సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

Tags:    

Similar News