Tirumala:శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దర్శించుకున్నారు.

Update: 2024-07-22 14:02 GMT

దిశ,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రసాద్ శుక్ల కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకోగానే ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. సినీనటుడు జబర్దస్త్ రాంప్రసాద్ కూడా నేడు స్వామివారిని దర్శించుకున్నారు.


Similar News