అమెరికాలో కాల్పుల కలకలం..తెలుగు డాక్టర్ అక్కడికక్కడే మృతి

తిరుపతి జిల్లా, నాయుడుపేట మండలం లోని మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరం శెట్టి రమేష్ బాబు(64) అమెరికాలో శుక్రవారం దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో విషాద ఛాయలు మిగిల్చింది.

Update: 2024-08-25 06:07 GMT

దిశ,నాయుడుపేట:తిరుపతి జిల్లా, నాయుడుపేట మండలం లోని మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరం శెట్టి రమేష్ బాబు(64) అమెరికాలో శుక్రవారం దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో విషాద ఛాయలు మిగిల్చింది. వివరాల్లోకి వెళితే..చనిపోయిన వ్యక్తి స్థానిక తెలుగుదేశం పార్టీ లీడర్ పేరం శెట్టి రామయ్య సోదరుడు. తిరుపతి వెంకటేశ్వర వైద్య కళాశాలలో డాక్టరేట్ పట్టా పొంది స్థానికంగా మంచి వైద్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లకు అమెరికా దేశంలోని " తస్క లూసా " ప్రాంతంలో వైద్య సేవలు అందించి ఆ ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు నిర్మించి సేవలందిస్తూ కలసి వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల సంఘటనలో డాక్టర్ మృతి చెందినట్లు కుటుంబీకుల సమాచారం. గ్రామీణ ప్రాంతం నుంచి అమెరికాలో స్థిరపడ్డాడనుకున్న కుటుంబీకులు బంధువులకు ఈ సంఘటన విషాదఛాయలు నింపింది. విషాద వార్త తెలుసుకున్న బంధువులు, డాక్టర్ స్నేహితులు కుటుంబీకులను పరామర్శించి, జరిగిన విషయం పై విచారం వ్యక్తం చేశారు. మంచి డాక్టర్ ని కోల్పోయామని ఆ గ్రామస్తులు కూడా ఆవేదన చెందుతున్నారు.


Similar News