BREAKING: వికటించిన ఇంజెక్షన్.. ఏకంగా 22 మందికి వణుకు, వాంతులతో తీవ్ర అస్వస్థత
ఇంజెక్షన్ వికటించడంతో ఏకంగా 22 మంది అస్వస్థతకు గురైన ఘటన బుధవారం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: ఇంజెక్షన్ వికటించడంతో ఏకంగా 22 మంది అస్వస్థతకు గురైన ఘటన బుధవారం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. నక్కలపల్లి ఆసుపత్రిలో వైరల్ ఇన్ఫెక్షన్తో చేరిన రోగులకు వైద్యులు సెఫోటాక్సిమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే రోగుల్లో తీవ్రంగా వాంతులు, వణుకు మొదలయ్యాయి. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన వైద్యలు వారిని మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.