BREAKING: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా

ఏపీలో వైసీపీకి గడ్డు కాలం నడుస్తోంది.

Update: 2024-08-30 08:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీకి గడ్డు కాలం నడుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఆ పార్టీ నాయకులు, కేడర్‌‌లో నిస్తేజం నిండుకుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్‌బై చెప్పబోతున్నారు. అందులో కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. ఈ మేరకు తమ రాజీనామాను మరికొద్దిసేపట్లోనే మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుకు అందజేయబోతున్నారు. కాగా గురువారం పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రాజీనామా చేయగా.. ఆ వెనువెంటనే ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వైదొలుగుతుండటంతో ప్రస్తుతం వైసీపీ నాయకుల్లో అసలు ఏం జరగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. 


Similar News