తిరుమల లడ్డూ వివాదం పై ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్.. డిప్యూటీ సీఎం పవన్ అసహనం!?

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

Update: 2024-09-27 06:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణల పై ట్విట్టర్‌లో వరుస పోస్ట్‌లతో స్పందిస్తున్న ప్రకాశ్ రాజ్ తాజాగా మరో పోస్టు పెట్టారు. ఆయన ట్వీట్లపై విమర్శలు వ్యక్తమవుతున్న కూడా ‘తగ్గదే లే’ అన్నట్టుగా వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. దీనిపై తాను ఇండియాకు వచ్చిన తర్వాత సమాధానం చెబుతానని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్ చేశారు. ‘‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా..? జస్ట్ ఆస్కింగ్’’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.


Similar News