కడప జిల్లాలో మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

కడప జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. .

Update: 2024-08-26 15:05 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్ సమీపం చింతకొమ్మదిన్నె పరిధిలో కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  మృతులు చక్రాయపేట మండలం కొన్నేపల్లి చెందిన వారిగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై జామ్ అయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇదే జిల్లా దువ్వూరు మండలం చింతగుంటలో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. 


Similar News