ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్ ఇదే..!

తాజగా పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలు - 2024 దృష్ట్యా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా, ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించే దిశగా పల్నాడు జిల్లా పోలీస్ విభాగం అడుగులు వేస్తుందని ఎస్పీ తెలిపారు.

Update: 2024-04-12 05:01 GMT

దిశ.నరసరావుపేట: తాజగా పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలు - 2024 దృష్ట్యా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా, ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించే దిశగా పల్నాడు జిల్లా పోలీస్ విభాగం అడుగులు వేస్తుందని ఎస్పీ తెలిపారు. దానిలో భాగంగానే ప్రజల నుండి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు అందుకోవడానికి వీలుగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక ఫోన్ నంబర్ - 9440796184 కేటాయించడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.

పల్నాడు జిల్లా ప్రజలు స్వేచ్చగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే తమ ప్రధాన ధ్యేయం అని ఆయన అన్నారు. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన వారు ఎవరైనా సరే వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.

Tags:    

Similar News