17న తెలంగాణకు అమిత్ షా.. భారీ సభ ఎక్కడంటే.?

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 17న రాష్ట్రానికి రానున్నట్లు తెలంగాణ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొననున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన యోధులైన వెయ్యి మందిని రజాకార్లు మర్రిచెట్టు వద్ద […]

Update: 2021-09-07 04:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 17న రాష్ట్రానికి రానున్నట్లు తెలంగాణ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొననున్నారు.

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన యోధులైన వెయ్యి మందిని రజాకార్లు మర్రిచెట్టు వద్ద ఊచకోత కోశారని.. కాలక్రమంలో ఇది వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందిందని అందుకే సభ ఇక్కడ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

 

Tags:    

Similar News