ఈ నెల 26 నుంచి రైతుబంధు డబ్బులు జమ

సీఎం కేసీఆర్​ రైతులకు శుభవార్త చెప్పారు.

Update: 2023-06-23 07:42 GMT

దిశ, వెబ్​డెస్క్​ : సీఎం కేసీఆర్​ రైతులకు శుభవార్త చెప్పారు. వానాకాలం పంటసాయంగా రైతు బంధు అందించాలని నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. ఎకరానికి ఐదు వేల చొప్పున ఈ డబ్బులు అందించనున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్​రావుకు సీఎం కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈసారి పోడు భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ డబ్బులు అదించనున్నారు. మొదటి రోజు ఎకరం, రెండో రోజు రెండెకరాల రైతులకు డబ్బులు జమ చేయనున్నారు. తరువాత మిగతా రైతులకు అందించనున్నారు. 

Also Read..

స్టేట్‌పై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీకి ఈటల, రాజగోపాల్ రెడ్డి! 

Tags:    

Similar News