పత్తి రైతులకు శుభవార్త.. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు.. అగ్రికల్చర్ జేడీఏ పుల్లయ్య

అదిలాబాద్‌లో పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.

Update: 2024-05-28 06:14 GMT

దిశ వెబ్ డెస్క్: అదిలాబాద్‌లో పత్తిరైతుల కష్టాలు అన్నీఇన్నీ కాదు. పత్తివిత్తనాల కోసం రైతుల రాత్రిపగలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనితో దుకాణాల ముందు క్యూలైన్లు బారులు తీరాయి. కాగా తమకు తగినన్ని నాన్యమైన విత్తనాలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై అగ్రికల్చర్ జేడీఏ పుల్లయ్య స్పందించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన రైతులు ఆందోళనచెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతుల కోసం మరో 50 వేల పత్తి ప్యాకెట్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.  


Similar News