చేపల వేటకు వెళ్లకండి.. అప్రమత్తంగా ఉండండి

దిశ, సూర్యాపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట పట్టణంలో పుల్లారెడ్డి చెరువును, వివిధ ప్రాంతాల్లోని వరద నీరును జిల్లా అదనపు కలెక్టర్ డి.సంజీవ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని కోరారు. ప్రవహించే నదుల్లోకి, కాల్వలోకి దిగవద్దు అని తెలిపారు. చెరువులు అలుగులు పోస్తున్న ఈ క్రమంలో ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని చెప్పారు. రోడ్డుపై నీరు ప్రవహించే కల్వర్టు వద్ద […]

Update: 2020-08-16 08:11 GMT

దిశ, సూర్యాపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట పట్టణంలో పుల్లారెడ్డి చెరువును, వివిధ ప్రాంతాల్లోని వరద నీరును జిల్లా అదనపు కలెక్టర్ డి.సంజీవ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని కోరారు. ప్రవహించే నదుల్లోకి, కాల్వలోకి దిగవద్దు అని తెలిపారు. చెరువులు అలుగులు పోస్తున్న ఈ క్రమంలో ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని చెప్పారు. రోడ్డుపై నీరు ప్రవహించే కల్వర్టు వద్ద వాహనాలను రోడ్డు దాటించవద్దని హెచ్చరించారు.

Tags:    

Similar News